VHP హైందవ శంఖారావం సభకు ఏర్పాట్లు
NEWS Oct 20,2024 07:08 am
విజయవాడ: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని VHP కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్రజైన్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు, సమస్యలను ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.