రెజీనా స్కూల్పై చర్యలు తీసుకోవాలి
NEWS Oct 19,2024 04:54 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని రెజీనా కార్మెలి కాన్వెంట్ స్కూల్ లో హిందూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్న తీరుపై శనివారం పాల్వంచ మండల విద్యాశాఖ అధికారి శ్రీరాంమూర్తి కి బిజేపీ నాయకులు వినతి పత్రం అందించారు. వెంటనే విచారణ జరిపి, ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.