అదృశ్యమైన వ్యక్తి శవంగా లభ్యం
NEWS Oct 19,2024 04:59 pm
తూప్రాన్ పట్టణ పెద్ద చెరువులో కుళ్లిపోయిన శవం లభించినట్లు ఎస్సై శివానందం తెలిపారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లికి చెందిన బందెల దాసు (45) పక్కనున్న చెట్లు నరికిన వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు 9న ఇంట్లోంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. తూప్రాన్ చెరువులో లభించిన శవాన్ని పచ్చబొట్టు ఆధారంగా దాసుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.