రైతులకు శాపంగా.. సీసీఐ నిబంధనలు
NEWS Oct 19,2024 07:05 am
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీసీఐ నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. పత్తిలో 8 నుంచి12 శాతం వరకు తేమ ఉంటేనే మద్దతు ధర రూ.7,521 చెల్లిస్తామని సీసీఐ నిబంధన విధించింది. ఇటీవల వారంలో రెండు మూడు సార్లు వర్షాలు కురుస్తుండటంతో పత్తిలో తేమ శాతం 20నుంచి 30శాతం ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలో గత్యంతరం లేక వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు రైతులు తెలిపారు.