Logo
Download our app
ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం
NEWS   Oct 19,2024 05:35 am
హైద‌రాబాద్: పంజాగుట్ట ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఒక కారు అతివేగంతో దూసుకెళ్లి అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source