విశాఖలో లోకేశ్ ప్రజా దర్బార్
NEWS Oct 18,2024 04:44 pm
మంత్రి నారా లోకేశ్ సాక్షి మీడియాపై పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖపట్నం వచ్చారు. ఆయనను కలిసేందుకు ఈ సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ విశాఖ టీడీపీ కార్యాలయంలో వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు.. ప్రజాదర్బార్ లో లోకేశ్ ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించారు.