ఐటీఐలలో ప్రవేశాలకు చివరి అవకాశం
NEWS Oct 18,2024 05:04 pm
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ లలో మిగిలి అన్న సీట్లను భర్తీ చేయటానికి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అభ్యర్థులకు చివరి అవకాశాన్ని కల్పించారని మెట్పల్లి లక్ష్మి ప్రైవేటు ఐటీఐ ప్రిన్సిపాల్ లవంగ రాజశేఖర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ చివరి అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.