కొండగట్టు JNTUని యూనివర్సిటీగా
తీర్చిదిద్దేందుకు కృషి: నరేందర్ రెడ్డి
NEWS Oct 18,2024 04:52 pm
కొండగట్టు JNTUను యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ అధినేత డా. నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మినీ స్టేడియం, రామాలయం గ్రౌండ్, మునిసిపల్ పార్క్లో SKNR మైదానంలో వాకర్స్తో ముఖాముఖి నిర్వహించి, అనంతరం పట్టభద్రులను కలిసి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు.