అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా
తహసీల్దార్ వెంకటేశ్వర్లు
NEWS Oct 18,2024 04:31 pm
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. అందులో భాగంగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు ఫారాలు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిటర్నింగ్ అధికారి గా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. రిటర్నింగ్ అధికారి హోదాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలించి నమోదుకు సిఫార్సు చేస్తారు.