కేఏ పాల్ సంచలన ఆరోపణలు
NEWS Oct 18,2024 11:26 am
తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని, 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై కేసు పెట్టానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తాను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని ఒక కీలక నేత బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ తనను బెదిరించిన వాళ్లే పోయారే తప్ప తనకేమీ కాలేదన్నారు. ఇప్పుడు తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానన్న పాల్.. ఇకపై తనకు దేవుడే సెక్యూరిటీ అన్నారు.