గాలుకుంటూ వ్యాధి నివారణ టీకాలు
NEWS Oct 18,2024 09:24 am
జాతీయ పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలి కుంటూ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో డా. అశోక్ గాలుకుంటూ వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ.. గ్రామంలో 550 గేదెలకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశామని చెప్పారు. ఈ వ్యాధి వల్ల పశువులు తీవ్ర జ్వరము, నోటి నుండి చొంగ కారడం, నోటిలో పుండ్లు కావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని, వ్యాధి వైరస్ వల్ల వస్తుందన్నారు.