మోదీ అధ్యక్షతన ఎన్డీయే సమావేశం
NEWS Oct 17,2024 05:27 pm
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఛండీగఢ్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు, పవన్ తో మోదీ ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.