తహసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి జయంతి
NEWS Oct 17,2024 06:16 pm
కొత్తగూడెం తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో నాయుబ్ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మూల రామాయణ రచయిత మహా గాయత్రీ వరప్రసాధితుడు, వ్యాకరణ చందస్సుకారుడు సర్వ ప్రజానీకనికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి అన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.