నూతన కోర్టు పనుల పరిశీలన
NEWS Oct 17,2024 05:49 pm
అల్లాదుర్గంలో నూతనంగా ఏర్పాటు కానున్న సివిల్ కోర్టు భవనాన్ని మెదక్ జిల్లా మెజిస్ట్రేట్ లక్ష్మి శారద సందర్శించారు. సందర్భంగా భవనంలోని ప్రారంభోత్సవ పనులను ఆమె సమీక్షించారు. ఈనెల 19న హైకోర్టు జడ్జి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉండడంతో కోర్టు భవనంలో మౌలిక వసతులు కల్పన వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో తాసిల్దార్ మల్లయ్య, ఎస్సై ప్రవీణ్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.