కాలనీ వాసులకు సౌకర్యాలు కల్పించండి
NEWS Oct 17,2024 12:40 pm
కొండపల్లి - ఇలప్రోలు రోడ్డు లో గల జగన్న సెంటు స్థలాల్లో ఇటీవల వరదలకు తీవ్రంగా నష్టం జరిగిందని, వరద సాయం కొద్ది మందికి మాత్రమే వచ్చాయని, మిగిలిన వారికి తక్షణమే ఇవ్వాలని, అంతర్గత రోడ్లు బురదతో అధ్వానంగా ఉన్నాయని తక్షణమే గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం. మహేష్ డిమాండ్ చేశారు. మంచినీరు పంపు లైన్, రోడ్లు, అంగన్వాడీ స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ANM ఆశా వర్కర్)ణఙ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.