విద్యార్థులతో కలిసి డిఇఓ భోజనం
NEWS Oct 17,2024 11:41 am
రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరచారి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన అమలుతీరును పరిశీలించారు. విద్యార్థులు,హెడ్మాస్టర్ తో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజు భోజనాలు ఎలా ఉంటున్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేశారని, భోజనం రుచికరంగా ఉందని ఎండిఎం వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి డా.ఎం.ప్రభుదయాల్ ను అభినందించారు.