విద్యార్థులకు సేవోద్గం బ్యాగుల పంపిణీ
NEWS Oct 17,2024 11:55 am
నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవోద్గం ఫాండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు 4 లక్షల రూపాయలతో బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి రేపటి పౌరుడు కావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ చౌహన్, సంజీవరెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.