కొండగట్టుకు చేరుకున్న విజయ నెయ్యి
NEWS Oct 17,2024 11:45 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి లడ్డు ప్రసాద తయారీ కేంద్రానికి విజయ డైరీకి చెందిన 20 క్వింటాళ్ల నెయ్యి చేరుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు తయారీలో వాడిన నెయ్యిపై విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో కొండగట్టు ఆలయానికి నెయ్యి సప్లై చేసిన కరీంనగర్ డైరీ నెయ్యి స్థానంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ నుంచి నెయ్యి సప్లై చేశారు.