కొమరం భీమ్ ధైర్య సాహసాలు ఆదర్శం
NEWS Oct 17,2024 06:52 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోరాట యోధుడు కొమరం భీమ్ తిరుగుబాటు ధైర్య సాహసాలు నేటికీ ఆదర్శమని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు ఆదివాసి నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ప్రతి మనిషి అన్యాయం, అధర్మంపై పోరాడాలని సూచించారు. నేటి యువత కొమరం భీమ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.