కొమరం భీమ్ విగ్రహానికి నివాళి
NEWS Oct 17,2024 06:43 am
భద్రాచలం పట్టణం నందు ఆదివాసి హక్కుల పోరాట యోధుడు కొమరం భీమ్ 84వ వర్థంతి సందర్భంగా పాత మార్కెట్లో ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదివాసీల కోసం అనేక పోరాటాలు చేసిన యోధుడు కొమురం భీం ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రం, అడ్వకేట్ పాయం రవివర్మ, మహిళ శక్తి నాయకురాలు సుధారాణి, మడివి నెహ్రూ, శ్రీను, కృష్ణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ వీరస్వామి పాల్గొన్నారు.