ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
NEWS Oct 17,2024 06:50 am
కరకగూడెం: తహశీల్దార్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రపంచానికి పరమ పవిత్రమైన రామాయణాన్ని మహర్షి వాల్మీకి వరంగా ఇచ్చారని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. వారి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు పాటించాలని పేర్కొన్నారు. మంచి మార్గాన్ని అనుసరించాలన్నారు.