న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు
NEWS Oct 16,2024 05:32 pm
ఢిల్లీ: ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లూ న్యాయ దేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉంది.