బాధిత కుటుంబాలకు అందని సాయం
NEWS Oct 16,2024 02:00 pm
మూలపాడు గ్రామపంచాయతీ పరిధిలో కృష్ణ వరదలకు సర్వం కోల్పోయిన 168 కుటుంబాలకు వరద సాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని నగదు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసిల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కృష్ణ వరదల సమయంలో అర్ధరాత్రి రెండున్నర గంటలకు CM చంద్రబాబు మూలపాడు బీసీ కాలనీ ప్రాంతంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.