కాలువలోకి కారు - 7గురు మృతి
NEWS Oct 16,2024 11:54 am
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద కారు కాలువలోకి దూసుకెళ్లగా ఏడుగురు మృతి చెందారు. వెల్దుర్తి - ఉసిరిక పల్లి రహదారిపై వెళ్తున్న కారు ఉసిరిక పల్లి శివారులోని చెరువు కాలువలోకి కారు దూసుకుపోయింది. కారు కాలువలో మునిగిపోగా.. కారులో ప్రయాణిస్తున్న సమీపతాండకు చెందిన నలుగురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది