బ్యాంకులను ప్రతి రైతు వినియోగించుకోవాలి
NEWS Oct 16,2024 06:52 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని మైలారం, హేమచంద్రపురం గ్రామపంచాయతీలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు అధ్యక్షతన నాబార్డ్ వారి సహకారంతో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి రైతు సహకార బ్యాంకులలో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అన్ని రకాల ఋణo తక్కువ వడ్డీ రేటుతో పొందవచ్చని ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.