అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి
NEWS Oct 16,2024 06:24 am
దుమ్మగూడెంలో చలక పేరుతో రేగుబల్లిలో నడుపుతున్న ఇసుక ర్యాంపులో అధిక లోడు లారీలు మళ్లీ మొదలయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రేగుబల్లి ఇసుక ర్యాంపులు జరిగే అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. రవాణా అధికారులు స్పందించాలని కోరారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి లారీ వాళ్ల దగ్గర నుంచి 200, ఇసుక ర్యాంపు మెయింటినెన్స్ అని మరో 200 వసూలు చేస్తున్నారని తెలిపారు.