విధులకి రాకుంటే తొలగిస్తాం.. సిఎండి
NEWS Oct 16,2024 05:55 am
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఉద్యోగి పాత్ర కీలకమని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ హెచ్చరించారు. విధులను సరిగా నిర్వహించకపోవడం, సమయపాలన పాటించకపోవడం, గైర్హాజరు వంటి విషయాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. సింగరేణి భవన్ నుంచి ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు.