ఖమ్మం: హైదరాబాద్కు అదనపు బస్సులు
NEWS Oct 15,2024 06:23 am
ఖమ్మం: దసరా పండుగ సెలవులు ముగియడంతో ఖమ్మం నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులతో ఖమ్మం న్యూ బస్టాండ్ రద్దీగా మారింది. 2 రోజుల నుంచి ఆర్టీసీ ఆధికారులు హైదరాబాద్కు అదనపు సర్వీసులను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ప్రయాణికుల రద్దీ ఉండటంతో హైదరాబాదు అదనపు బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు బస్టాండ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నామన్నారు.