రాజశేఖర్ను అభినందించిన ఆకునూరి మురళి
NEWS Oct 13,2024 01:14 pm
కొత్తగూడెం రామవరం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ప్రకృతి ప్రేమికుడు కె.ఎన్ రాజశేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ఆయనతో మామిడి మొక్కను నాటించారు. మన్ కి బాత్లో ప్రధాని మోడీ ప్రశంసించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరి కనకరాజు, మల్లికార్జున్, గౌస్ బాయ్, తూముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.