ఘనంగా అమ్మవారి నిమజ్జనం
NEWS Oct 13,2024 10:32 am
మంచిర్యాల: దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగింపుతో ఆదివారం అమ్మవారి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. హమాలివార్డులోని శ్రీ భక్తాంజనేయ షిరిడిసాయి ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహానికి అర్చకులు సంగార్స్ సంతోష్ శర్మ హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుడి మల్లేష్ తిరుమల, లక్ష్మీనారాయణ, వాసు, పురుషోత్తం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.