నీలకంఠాపురంలో దసరా ఉత్సవాలు
NEWS Oct 12,2024 01:45 pm
మడకశిర మండలం నీలకంఠాపుర గ్రామ నీలకంఠేశ్వనిం దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొని ఆలయాల్లో పూజల అనంతరం ఎద్దుల బండిపై రఘువీరా జంబూ సవారీ చేశారు. జంబూ సవారీని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థుల ప్రజలు భారీగా ఎద్దుల బండ్లలో తరలివచ్చారు. తొలుత రఘువీరా రెడ్డి ఇంటి నుండి ఎద్దుల బండిలో జంబు స్వారీగా నీలకంఠాపురం దేవస్థానములు వరకు జంబు సవారి నిర్వహించారు.