కాళికామాత అలంకారంతో భక్తులకు దర్శనం
NEWS Oct 10,2024 08:12 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవనం వాసవి మాత ఆలయంలో అమ్మవారు కాళికామాత అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చింది. 7 రోజులుగా నిత్య పూజ వివిధ రకాల ప్రసాదాలతో అమ్మవారికి నివేదన సమర్పించి నిత్య హోమం నిర్వహించారు. గురువారం దుర్గాష్టమి పురస్కరించుకొని చండీ హవన కార్యక్రమం పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ మహదాశీర్వచన కార్యక్రమం చేశారు.