Logo
Download our app
ఐక్యమతానికి వేదికలుగా పండుగలు
NEWS   Oct 09,2024 05:01 pm
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పండుగ ఐక్యమతానికి వేదికలుగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. రామవరం ప్రాంతంలోని పలు వార్డులలో దేవి నవరాత్రుల మండపాలను సందర్శించి.. మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత నేడు భక్తి మార్గంలో నడుస్తున్నారని, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు యువత ముందుండి నడిపించడం వల్ల ప్రజల్లో ఐక్యమత్యం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, కౌన్సిలర్స్, స్ధానిక యువతి యువకులు ప్రజలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source