వరద సాయంపై చర్చకు సిద్ధమా జగన్?
NEWS Oct 09,2024 10:39 am
వరద సాయంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని హోంమంత్రి అనిత విమర్శించారు. సీఎం చంద్రబాబుకి మంచి పేరు రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలకు దిగారు. వరద బాధితుల కోసం విపత్తునిర్వహణ శాఖ రూ.602 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.534 కోట్లు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు జగన్ ప్రకటించిన రూ.కోటి వరద సాయం ఎక్కడ అని మంత్రి అనిత ప్రశ్నించారు.