బీజేపీ ఓబీసీ మోర్చా సభ్యత్వ నమోదు
NEWS Oct 08,2024 03:12 pm
బీజేపీ జగిత్యాల ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం కోరుట్ల పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు గంధ మల్ల ఆనంద్ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రాచకొండ యాదగిరి బాబు, జిల్లా అధికార ప్రతినిధి, వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఉరుమల్ల చరణ్, కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు బింగి వెంకటేష్ పాల్గొన్నారు.