గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
NEWS Oct 08,2024 03:10 pm
2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకానికి జిల్లాకు చెందిన అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ ఐఎఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. 6, 7, 8, 9 తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు కులం, ఆదాయం సర్టిఫికెట్లతో ఈనెల 20వ తేదీ సా.5 గంటలలోపు గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.