తాళం వేసిన ఇంట్లో చోరీ
NEWS Oct 08,2024 12:45 pm
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గ్రామం చిన్న మంగళి సాయికుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారం, 20 తులాల వెండి, 4000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు తెలియజేశారు. కేసు నమొదు చేసుకున్న వెల్దుర్తి ఎస్సై రాజు చేపట్టారు.